News March 28, 2025
హెలీప్యాడ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను శుక్రవారం ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ పనులను పూర్తి చేయాలని ఆర్& బీ ఇంజనీర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభా వేదిక వద్ద బ్యారికేడ్లలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ప్రజా వేదికను సౌకర్యవంతంగా తయారు చేయాలన్నారు
Similar News
News November 24, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు అధికారికంగా ఖరారయ్యాయి.
మొత్తం 260 పంచాయతీలు ఉండగా..
63 జనరల్,
58 జనరల్ మహిళ..
29 బీసీ జనరల్,
24 బీసీ మహిళ..
32 ఎస్సీ జనరల్,
24 ఎస్సీ మహిళ..
17 ఎస్టీ జనరల్,
13 ఎస్టీ మహిళ స్థానాలుగా నిర్ణయించారు. మొత్తం మీద 121 పంచాయతీలు జనరల్ అభ్యర్థులకు, బీసీలకు 53, ఎస్సీలకు 56, ఎస్టీలకు 30 పంచాయితీలు దక్కనున్నాయి.
News November 24, 2025
మహబూబాబాద్: 482 జీపీల్లో బీసీలకు 24 స్థానాలే!

జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా సర్పంచ్ రిజర్వేషన్ స్థానాల్లో బీసీలకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. మహబూబాబాద్- 1, కేసముద్రం -2, తొర్రూర్-6, పెద్ద వంగర- 3, నర్సింహులపేట-6, చిన్నగూడూర్ -1, నెల్లికుదురు -4, దంతాలపల్లి- 3 మొత్తం బీసీలకు 24 జీపీల్లోనే రిజర్వేషన్ స్థానాలను అధికారులు కేటాయించారు.
News November 24, 2025
స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.


