News January 28, 2025

హెల్మెట్ ధరించే వాహనం నడపాలి: ఎంపీ హరీష్ మాధుర్

image

జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో భట్లపాలెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన మోటార్ వాహనాల అవగాహన సదస్సులో ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతివిద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాహనాలు నడపాలన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా వాహనం తీయకూడదని వివరించారు. సోషల్ మీడియాలో ఎంత అవగాహనతో ఉంటున్నారో రహదారి భద్రత పట్ల అంతే బాధ్యతగా ఉండాలన్నారు.

Similar News

News April 14, 2026

కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

image

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.

News April 14, 2026

కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

image

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.

News April 14, 2026

అట్రాసిటీ బాధితురాలికి సర్కారు కొలువు!

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.