News March 27, 2025

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విడదల రజిని 

image

నేడు హైకోర్టులో విడదల రజిని పిటిషన్‌పై విచారణ జరగనుంది. స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రజిని పిటిషన్ వేశారు. ఎడ్లపాడు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గర రూ.2.20కోట్లు తీసుకున్నట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. హైకోర్టు బెయిల్ విషయంలో గురువారం తీర్పు ఏమి చెబుతుందనే మాజీ మంత్రి విడదల రజిని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 

Similar News

News November 21, 2025

విద్యార్థులకు ఉపశమనం.. రూ.161 కోట్ల బకాయిలు విడుదల

image

ఖమ్మం: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన రూ.161 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజాభవన్లో జరిగిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది పేద విద్యార్థులకు, కళాశాలలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

News November 21, 2025

మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

image

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.

News November 21, 2025

వేగంగా విస్తరిస్తోన్న విశాఖ

image

GDPలో దేశంలో టాప్-10 నగరాలలో నిలిచిన విశాఖ నగరం వేగంగా విస్తరిస్తుంది‌. కార్పొరేషన్‌గా ఉన్న విశాఖపట్నం తరువాత గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధితో వేగంగా దూసుకుపోతుంది. ఒక వైపు భోగాపురం ఎయిర్ పోర్టు, మరోక వైపు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.CII సమ్మిట్‌లో పెద్ద ఎత్తన పెట్టుబడులు వచ్చాయి.