News March 27, 2025
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విడదల రజిని

నేడు హైకోర్టులో విడదల రజిని పిటిషన్పై విచారణ జరగనుంది. స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రజిని పిటిషన్ వేశారు. ఎడ్లపాడు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గర రూ.2.20కోట్లు తీసుకున్నట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. హైకోర్టు బెయిల్ విషయంలో గురువారం తీర్పు ఏమి చెబుతుందనే మాజీ మంత్రి విడదల రజిని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 25, 2026
శతశాతం ఉత్తీర్ణతకు కృషి: కలెక్టర్

అక్షర ఆంధ్రా అభ్యర్థులు శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నామని గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అక్షర ఆంధ్రా కార్యక్రమంపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 90,426 మంది నమోదు అయ్యారని, 9,043 మంది వాలంటీర్లు బోధిస్తున్నారని కలెక్టర్ వివరించారు. పలు కేంద్రాలను స్వయంగా సందర్శించామని చెప్పారు.
News February 25, 2026
గొల్లప్రోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గొల్లప్రోలు మండలం వన్నెపూడి జాతీయ రహదారి-16పై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవే జంక్షన్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఆటో, మోటార్ బైక్ను బలంగా ఢీకొట్టిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 25, 2026
చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉండాలంటే?

ఇంటి ప్రధాన ద్వారం మహాలక్ష్మి ప్రవేశించే ప్రదేశమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘అందుకే చెప్పులను గుమ్మానికి అడ్డంగా ఉంచకూడదు. అలా విడిస్తే సానుకూల శక్తి ఆగిపోతుంది. ఇంటి యజమాని గౌరవం తగ్గుతుంది. చెప్పుల స్టాండ్ ఇంటికి పశ్చిమ/వాయువ్య దిశలో ఉంచటం శ్రేయస్కరం. షూ రాక్ను ఎప్పుడూ మూసి ఉంచాలి. క్రమ పద్ధతిలో అమర్చాలి. ఉత్తర/తూర్పు దిశల్లో ఉంచితే ఇబ్బందులు కలుగుతాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


