News January 25, 2025
హైకోర్టు న్యాయమూర్తిగా ఖమ్మం జిల్లా వాసి ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లికి చెందిన జస్టిస్ ఈడ తిరుమలదేవితో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు న్యాయమూర్తిగా, తెలంగాణ జ్యడీషియల్ అకాడమీ డైరెక్టర్గా జస్టిస్ తిరుమలాదేవి పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా పదోన్నతి లభించింది.
Similar News
News February 24, 2026
హోలీ పండుగ ఎప్పుడంటే?

ఈ ఏడాది హోలీని ఏ తేదీన(మార్చి 3 or 4) జరుపుకోవాలన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. దీనిపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ధ్రుక్ పంచాంగం ప్రకారం హోలికా దహనం మార్చి 3న, రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలని తెలిపారు. ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2న సాయంత్రం 5.55 నుంచి మార్చి 3 సా.5.07 వరకు ఉంటుందంటున్నారు. అయితే 3వ తేదీన చంద్ర గ్రహణం ఉండటం వల్ల 4న పండుగ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News February 24, 2026
విశాఖలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

విశాఖలోని మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మురళి నగర్ జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న వ్యక్తిని విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడకక్కడ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2026
పంటల్లో బోరాన్ లోపం – కనిపించే లక్షణాలు

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపం వల్ల మొక్కల చిగుర్లు వికృతాకారంలో
మారతాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ఆకులు ముడుచుకుపోతాయి.


