News December 19, 2024
హైకోర్టు మాజీ న్యాయమూర్తికి మెమోరండం సమర్పణ

తెలంగాణ రాష్ట్ర షెడ్యూలు కులాల విచారణ కమిషనర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్ని అంబేడ్కర్ మాల సంఘం నాయకులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలని మాల సంఘం అధ్యక్షుడు ఎడబోయిన ప్రభాకర్ కోరారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్లో కమిషనర్కు వారు మెమోరండం సమర్పించారు. కార్యక్రమంలో మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 29, 2025
వరంగల్: భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సహాయనిధి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా విద్యాధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో హెడ్మాస్టర్లు విద్యార్థులు, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించాలనీ, విద్యార్థులు సురక్షితంగా ఇంటికి చేరేలా చూడాలని సూచించారు.
News October 29, 2025
వరంగల్: రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సహాయార్థం కలెక్టరేట్లో 1800 425 3424, జీడబ్ల్యూ ఎంసీలో 1800 425 1980 నంబర్లను ఏర్పాటు చేశారు. సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
News October 29, 2025
WGL: మొంథా తుఫాన్ ప్రభావం.. వర్షపాతం వివరాలు

మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఉదయం 8:30 గంటల నుండి 10:00 గంటల వరకు అత్యధిక వర్షపాతం రాయపర్తి మండలంలో 55.8 mm, వర్దన్నపేటలో 54.5mm నమోదైంది. పర్వతగిరి మండలంలో 42.8 mm, నెక్కొండలో 34.6 mm, ఖానాపూర్లో 34.0, చెన్నారావుపేటలో 19.5mm, సంగెంలో 12.3 mm, నర్సంపేటలో 9.0mm నమోదయ్యాయి.


