News December 19, 2024
హైకోర్టు మాజీ న్యాయమూర్తికి మెమోరండం సమర్పణ
తెలంగాణ రాష్ట్ర షెడ్యూలు కులాల విచారణ కమిషనర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్ని అంబేడ్కర్ మాల సంఘం నాయకులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలని మాల సంఘం అధ్యక్షుడు ఎడబోయిన ప్రభాకర్ కోరారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్లో కమిషనర్కు వారు మెమోరండం సమర్పించారు. కార్యక్రమంలో మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2025
మట్టెవాడ: విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన సదస్సు
మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలపై మట్టెవాడలోని ఓ కళాశాలలో విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. వీటితో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, ర్యాగింగ్, షీ టీం పోలీసుల పనితీరు గురించి వివరించారు. పోలీసులను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
News January 22, 2025
WGL: తరలివచ్చిన పసుపు, పల్లికాయ.. ధరలు ఇలా..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈరోజు పసుపు, పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపు ధర రూ.12,112 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయకి నిన్న రూ. 6100 ధర రాగా.. నేడు రూ.6200 ధర వచ్చింది. పచ్చి పల్లికాయ నిన్నటి లాగే రూ.4400 ధర పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
News January 22, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) ధర నిన్న రూ. 2,535 పలకగా.. నేడు రూ.2,450కి పడిపోయింది. అలాగే, పాత తేజా మిర్చి ధర రూ.13,400, పాత 341 రకం మిర్చి ధర రూ.14,300, పాత వండర్ హాట్ మిర్చి రూ.14,500, 5531 మిర్చి రూ.12వేలు పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.