News November 11, 2024
హైడ్రా కమిషనర్ ఇంట సకుటుంబ సర్వే

గ్రేటర్ హైదరాబాద్లో కుల గణన సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. ఈ క్రమంలో మధురానగర్లో ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి సర్వే నమోదు కోసం అధికారులు వెళ్లారు. ఒక్కోఇంటి వద్ద అరగంట సమయం పడుతుందని డాటాను ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. చార్మినార్, సికింద్రాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీత్సవ కోట, కూకట్పల్లి, శేరిలిగంపల్లి వాటర్ బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News December 18, 2025
గండిపేట నీరు సురక్షితం.. వదంతులు నమ్మొద్దు: జలమండలి క్లారిటీ!

గండిపేటలో మురుగునీరు కలిసినట్లు వస్తున్న వార్తలను జలమండలి MD అశోక్ రెడ్డి ఖండించారు. వ్యర్థాలను పారబోసేందుకు యత్నించిన ప్రైవేట్ ట్యాంకర్ను ముందే గుర్తించి అడ్డుకున్నారని, రిజర్వాయర్ కలుషితం కాలేదని స్పష్టం చేశారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, IS ప్రమాణాలతో ‘మూడంచెల క్లోరినేషన్’ పద్ధతిలో నీటిని శుద్ధి చేస్తున్నట్లు వివరించారు.
News December 18, 2025
HYD: ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశను మార్చింది

<<18569096>>శ్రీశ్రీ<<>> రచించిన ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశనే మార్చిన సంచలన కవితా సంకలనం. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల ఆవేదన, ఆకలి, నిరుద్యోగంపై గర్జించే పద్యాలు ఇందులో అగ్నిజ్వాలలుగా నిలుస్తాయి. 1930లో సామాజిక కల్లోలమే ఈ కవితలకు ప్రాణం. అలంకార కవిత్వాన్ని తోసిపుచ్చి, అభ్యుదయ కవిత్వానికి బాట వేసిన గ్రంథమిది. ‘మహా ప్రస్థానానికి ముందు- తర్వాత’ అనే విభజనకు కారణమైన ఈ సంపుటి, తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయి.
News December 18, 2025
RR: 3 ఫేజుల్లో.. ముగ్గురు లక్కీ సర్పంచ్లు

రంగారెడ్డి జిల్లాలో 3విడతల్లో లక్కీగా సర్పంచ్ పీఠం ముగ్గురిని వరించింది. 1st ఫేజ్లో కొందర్గు చిన్నఎల్కిచర్లలో ఇద్దరికి సమాన ఓట్లురాగా టాస్తో రాజు గెలిచారు. 2nd ఫేజ్లో చేవెళ్ల గుండాలలో నరాలు తెగే ఉత్కంఠలో ఒక్క ఓటుతో బుచ్చిరెడ్డి గెలిచారు. 3rd ఫేజ్లో యాచారం తులేఖుర్దులో ఇద్దరికి సమాన ఓట్లు రాగా ఉద్రిక్తతకు దారితీస్తుందని గమనించిన పోలీసులు పరిస్థితి అదుపుచేయగా రికౌంటింగ్లో రమేశ్ గెలుపొందారు.


