News November 11, 2024

హైడ్రా కమిషనర్ ఇంట సకుటుంబ సర్వే 

image

గ్రేటర్ హైదరాబాద్‌లో కుల గణన సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. ఈ క్రమంలో మధురానగర్‌లో ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి సర్వే నమోదు కోసం అధికారులు వెళ్లారు. ఒక్కోఇంటి వద్ద అరగంట సమయం పడుతుందని డాటాను ఆన్‌లైన్ అప్‌లోడ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. చార్మినార్, సికింద్రాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీత్సవ కోట, కూకట్‌పల్లి, శేరిలిగంపల్లి వాటర్ బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News November 26, 2025

HYD: LOVEలో ఫెయిల్.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగి సూసైడ్

image

ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్ రెడ్డి (26) స్నేహితులతో కలిసి సింగపూర్ టౌన్షిప్‌లో అద్దెకుంటూ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. లవ్ ఫెయిల్ అయిందన్న బాధలో పవన్ తన రూమ్‌లో ఉరేసుకున్నాడు. స్నేహితులు గమనించి PSకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు వర్మ తెలిపారు.

News November 26, 2025

HYD: వెంటాడుతున్న విషసర్పాలు!

image

హైదరాబాద్ శివారు ఏరియాలను విషసర్పాలు వెంటాడుతున్నాయి. ఘట్‌కేసర్, ప్రతాపసింగారంలో రక్తపింజర, కొండచిలువలు ప్రత్యక్ష్యమైన ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా మొయినాబాద్‌లోనూ ఇదే భయం పట్టుకుంది. మొన్న మండల ఆఫీస్ సమీపంలో ఒక పామును స్థానికులు పట్టుకున్నారు. వరుస ఘటనలతో ప్రజలు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజల ప్రాణ రక్షణతో పాటు వన్య ప్రాణులనూ కాపాడాలని కోరుతున్నారు.

News November 26, 2025

లైన్‌క్లియర్: HYDలో అండర్‌ గ్రౌండ్‌ నుంచి కేబుల్స్!

image

విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కరించేందుకు TGSPDCL చర్యలకు ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ కేబుల్స్ తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపగా తాజాగా మంత్రివర్గం ఇందుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రూ.14,725 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే సిటీలో కరెంట్ పోల్స్, వేలాడుతోన్న వైర్ల సమస్యకు తెర పడనుంది.