News November 11, 2024
హైడ్రా కమిషనర్ ఇంట సకుటుంబ సర్వే

గ్రేటర్ హైదరాబాద్లో కుల గణన సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. ఈ క్రమంలో మధురానగర్లో ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి సర్వే నమోదు కోసం అధికారులు వెళ్లారు. ఒక్కోఇంటి వద్ద అరగంట సమయం పడుతుందని డాటాను ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. చార్మినార్, సికింద్రాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీత్సవ కోట, కూకట్పల్లి, శేరిలిగంపల్లి వాటర్ బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.
News November 17, 2025
గ్రేటర్ చెరువులకు హైడ్రా అండ.. త్వరలో బాధ్యతలు ?

మహానగరంలో పలు చెరువులు కబ్జా కావడంతో వాటిని పరిరక్షించేందుకు హైడ్రా నడుంబిగించింది. ఈ క్రమంలో చెరువుల బాధ్యతను మొత్తం హైడ్రాకు అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. చెరువులను కాపాడటంతో పాటు అభివృద్ధి కూడా హైడ్రా చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. GHMCలో చెరువుల పరిరక్షణకు సిబ్బంది సమస్య ఉండటంతో ఈ ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఇద్దరు కమిషనర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది.


