News February 16, 2025
హైదరాబాద్లో ఎన్నికల సందడి

HYDలో ఎన్నికల సందడి మొదలైంది. GHMCలో ఈ నెల 25న 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. BRS, BJP ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువగా ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్, MIM నుంచి ఎక్కువ మంది సభ్యులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఇక రానున్న బల్దియా ఎన్నికలపై INC పెద్దలు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం విశేషం. ఇప్పటివరకు BRS 2, INC నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు.
Similar News
News November 24, 2025
సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి: కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అములు చేసి జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు వచ్చేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హల్లో 2026 ప్రధానమంత్రి అవార్డుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
News November 24, 2025
SRCL: ‘రేపు స్వయం సహాయక సంఘాలకు రూ. 300 కోట్లు’

రాష్ట్రంలోని 3,50,000 మహిళా స్వయంసహాయక సంఘాలకు మంగళవారం రూ.300.40 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ చీరెల పంపిణీ పురోగతి, వడ్డీలేని రుణాల పంపిణీ అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సిరిసిల్ల అదనపు కలెక్టర్ కరీమా అగర్వాల్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని డిప్యూటీ CM తెలిపారు.
News November 24, 2025
మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్

మొబైల్ యూజర్లకు టెలికం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో ఉన్న SIM దుర్వినియోగం అయితే వినియోగదారులదే బాధ్యత అని స్పష్టం చేసింది. సిమ్ కార్డులను సైబర్ మోసాలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వాడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ ఐడెంటిటీతో లింక్ అయిన సిమ్ కార్డులు, డివైస్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. <<18316809>>IMEI<<>> నంబర్లను ట్యాంపర్ చేసిన ఫోన్లను ఉపయోగించవద్దని సూచించింది.


