News February 16, 2025

హైదరాబాద్‌లో ఎన్నికల సందడి

image

HYDలో ఎన్నికల సందడి మొదలైంది. GHMCలో ఈ నెల 25న 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. BRS, BJP ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువగా ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్, MIM నుంచి ఎక్కువ మంది సభ్యులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఇక రానున్న బల్దియా ఎన్నికల‌పై INC పెద్దలు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం విశేషం. ఇప్పటివరకు BRS 2, INC నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు.

Similar News

News March 28, 2025

హైకోర్టుల్లో 62 లక్షల పెండింగ్ కేసులు!

image

వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారిపై కోర్టులో విచారణ పూర్తిచేసేందుకు ఏళ్లు పడుతోంది. ఇందుకు కారణం న్యాయమూర్తుల కొరతేనని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో వెల్లడైంది. 2024 చివరి నాటికి సుప్రీంకోర్టులో 82,000, వివిధ హైకోర్టులలో 62 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 25 హైకోర్టుల్లో 1,122 మంది న్యాయమూర్తులను మంజూరు చేస్తే ప్రస్తుతం 750 మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.

News March 28, 2025

భద్రాద్రి: ట్రాక్టర్ కిందపడి రెండేళ్ల బాలుడి మృతి

image

భద్రాద్రి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇల్లందు మండలం బోయితండాలో ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తండాకు చెందిన శ్రీకాంత్ కుమారుడు ఆర్యన్(2) ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు టైర్ కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News March 28, 2025

HYD: కూతురిని హత్య చేసిన తల్లి

image

కూతురిని తల్లి హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి దంపతులు. భర్త మణికి 2 మూత్రపిండాలు పాడవగా.. 15 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించి మంగళవారం నీళ్ల బకెట్‌లో వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

error: Content is protected !!