News February 7, 2026
హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ @278

హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ శనివారం తెల్లవారుజామున గాజులరామారంలో 278గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Similar News
News March 17, 2026
HYD: ఫ్లోర్ కడిగినందుకు రూ.5వేల FINE

HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠినచర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్ వాసి తాగునీటితో ఫ్లోర్లు కడుగుతుండగా గుర్తించి రూ.5వేల జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
News March 17, 2026
HYD: భారీగా పెరిగిన ధరలు.. అడ్డుకోరా!

వాణిజ్య గ్యాస్ కొరత సాకుతో నగరంలో హోటల్ తిండి హోరెత్తుతోంది. టీ కప్పు నుంచి టిఫిన్ ప్లేట్ దాకా HYDలో ₹5- ₹10 వరకు పెంచేసిన హోటళ్లు.. గ్యాస్ సరఫరా చక్కబడినా ధరలు తగ్గిస్తారన్న గ్యారెంటీ లేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో ధరలు పెరిగినా మళ్లీ కిందికి రాలేదు. ఉదాహరణకి ‘ఆనియన్ సలాడ్’! ఈ భారమంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి జీవుల మీదే పడుతోందంటున్నారు. ఈ దోపిడీని అడ్డుకోరా?
News March 17, 2026
HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్దుర్గ్, అమీర్పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్తో బాగోతం బయటపడింది.


