News January 12, 2025
హైదరాబాద్లో కిక్కిరిసిన వాహనాలు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లు ప్రయాణీకుల రద్దీ నెలకొంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు, ఏపీకి వెళ్లే వారితో కూకట్పల్లి, MGBS, JBS, దిల్సుఖ్నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. LB నగర్, వనస్థలిపురం, హయత్నగర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Similar News
News January 26, 2025
త్రివర్ణ శోభతో జంట నగరాలు
గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది.
News January 26, 2025
కాలీ మాత మందిరం వార్షికోత్సవంలో గవర్నర్
HYD బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాలీ మాత మందిరం ఐదో వార్షికోత్సవం శంషాబాద్లో ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గవర్నర్ మందిరంలో కాలి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరం కమిటీ ప్రతినిధులు ఆయనకు మెమోంటోను ప్రదానం చేశారు.
News January 26, 2025
ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.