News April 24, 2024
హైదరాబాద్లో తగ్గిన రిజిస్ట్రేషన్లు
HYDలో మార్చి నెలలో 6,416 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో 7,135 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 10% తగ్గినట్లు రియల్ ఎస్టేట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లాలో 46%, మేడ్చల్ మల్కాజిగిరిలో 40%, హైదరాబాదులో 10%, సంగారెడ్డిలో ఒక శాతం ఉన్నట్లు వెల్లడించింది.
Similar News
News January 16, 2025
సికింద్రాబాద్లో ముగిసిన కైట్ ఫెస్టివల్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ బుధవారంతో ముగిసింది. 50 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సూపర్ హీరోలతో పాటు భారీ ఆకారంలో స్నేక్, గాడ్జిల్లా, వివిధ రకాల బొమ్మలు, హైదరాబాద్ మెట్రో సంస్థ(L&T)కు చెందిన ట్రైయిన్ కైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి సందర్భంగా ఎంజాయ్ చేశారు.
News January 15, 2025
జార్జ్ రెడ్డి: ఈ పేరు HYDలో యాదుంటది!
‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి పేరు ఎప్పటికీ యాదుంటది. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1947, JAN 15న జార్జ్ జన్మించారు. 1962లో ఆయన ఫ్యామిలీ HYDలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్ OUలో పీజీ చేశారు. వర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే హత్యచేశారు. నేడు జార్జ్ జయంతి.
News January 15, 2025
HYD: పోరాట యోధుడి జయంతి నేడు
1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్ఫ్రాయిడ్ వంటి ఫిలాసఫర్లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.