News November 21, 2024
హైదరాబాద్లో పెరుగుతోన్న కాలుష్యం!

HYDలో వాయి కాలుష్యం పెరుగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాల ప్రకారం.. అత్యధికంగా సనత్నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 186గా నమోదైంది. జూపార్క్-168, పటాన్చెరు-160, బొల్లారం-113, సెంట్రల్ యూనివర్సిటీ-98, కొంపల్లి-90, నాచారంలో 76గా ఉంది. AQI ఇండెక్స్ 100 నుంచి 200 మధ్య ఉంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇబ్బందులు పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News October 17, 2025
రంగారెడ్డి: స్వీట్ షాప్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్

దీపావళి పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాల్లో జిల్లా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. తయారీకి ఉపయోగించే పదార్థాలు, నాణ్యతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రజలు స్వీట్స్ కొనేముందు వాటి నాణ్యతను గమనించి కొనాలని, తినే పదార్థాల్లో నాణ్యత లోపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. జోనల్ ఆఫీసర్ ఖలీల్, జిల్లా అధికారి మనోజ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్ పాల్గొన్నారు.
News October 16, 2025
RR: మద్యం దుకాణాలకు టెండర్లు పోటీ

సరూర్నగర్ ఎక్సైస్ జిల్లాలో 138 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్పటివరకు 1300కిపైగా దరఖాస్తులు అందినట్లు DPEO ఉజ్వల రెడ్డి తెలిపారు. సరూర్నగర్లో 32కి 500, హయత్నగర్ 28కి 510, ఇబ్రహీంపట్నంలో 19కి 100, మహేశ్వరంలో 14కి 150, అమన్గల్ 17కి 50, షాద్నగర్ 28కి 100 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మరో 2 రోజుల సమయం ఉండటంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
News October 14, 2025
RR: ‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు ఇవ్వొద్దు’

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా, అక్రమాలకు తావు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మంగళవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ వనజాత, డీఏఓ ఉష తదితరులు పాల్గొన్నారు.