News July 11, 2024
హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి!

హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మీరాలం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్మెట్ నుంచి బెంగళూరు-హైదరాబాద్ NH-44కు అనుసంధానం చేస్తూ తీగల వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో HMDA ప్లాన్ చేస్తోంది. మొత్తం 4 లైన్లు, 2.65 KM పొడవు, రెండు చోట్ల ఎంట్రీ ర్యాంపులు, ఒక చోట ఎగ్జిట్ ర్యాంప్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Similar News
News November 16, 2025
రాష్ట్రపతి నిలయంలో వేడుకలు.. ఉచితంగా పాసులు

ఈనెల 21 నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో కనువిందు చేయనున్నారు. 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. వీటిని చూడాలనుకున్న వారికి రాష్ట్రపతి నిలయం ఉచితంగా పాసులు అందజేస్తోంది. ఆసక్తిగల వారు ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
LINK: https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2
News November 16, 2025
బలమైన లీడర్ వస్తే.. నేను రెస్ట్ తీసుకుంటా: అక్బరుద్దీన్

‘ప్రజాభిమానంతో నేను ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా సేవచేశా.. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి.. ఈ క్రమంలో బాగా అలసిపోయా..రెస్ట్ తీసుకుంటా..’ అని చాంద్రాయణగుట్ట MLA అక్బరుద్దీన్ మనసులోమాట వెల్లడించారు. ఓల్డ్ సిటీలో జరిగిన ఓకార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘పిల్లల అభివృద్ధి కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేశాను.. నా స్థానంలోకి ఎవరైనా బలమైన నాయకుడు వస్తే నేను తప్పుకొని ప్రశాంత జీవనం గడుపుతా’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు RTA స్ట్రాంగ్ వార్నింగ్

చేవెళ్ల బస్సు ప్రమాదం తరువాత RTA అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్ ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల లగేజీ కాకుండా ఇతర లగేజీ తీసుకువెళితే చర్యలు తీసుకుంటామన్నారు. 30 ప్రాంతాల్లో 24 గంటలపాటు ప్రత్యేక సిబ్బంది బస్సులను తనిఖీ చేస్తున్నారన్నారు.


