News September 10, 2024
హైదరాబాద్లో మొదలైన సందడి

HYDలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. 3 రోజుల పాటు పూజలు అందుకున్న చిట్టి గణనాథులు ట్యాంక్బండ్కు చేరుకుంటున్నాయి. సోమవారం సా. నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ఈ నెల 11, 13, 15, 17న ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ట్యాంక్బండ్కు వస్తారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్కి జై’ నినాదాలతో HYD హోరెత్తనుంది.
Similar News
News November 10, 2025
కోకాపేట్, మూసాపేట్లో భూముల వేలం!

కోకాపేట్, మూసాపేట్ ప్రాంతాల్లోని 9 ఖాళీ ప్లాట్ల ఈ-వేలం కోసం HMDA సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నవంబర్ 17 ఉదయం 11:00 గంటలకు T-Hub వేదికగా ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలిస్ (6), గోల్డెన్ మైల్ (1), మూసాపేట్లో (2) ప్లాట్లు వేలం వేయనున్నారు. ఆసక్తిగల డెవలపర్లు పాల్గొనవచ్చని HMDA పిలుపునిచ్చింది. మరింత సమాచారం కోసం www.hmda.gov.inను సంప్రదించండి.
SHARE IT
News November 10, 2025
జూబ్లీ బైపోల్: ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు!

ప్రజాస్వామ్యం పటిష్ఠం కావాలంటే ప్రతి ఓటు కీలకం. ఓటు హక్కు మాత్రమే కాదు, భవిష్యత్తుకి బలం. పార్టీ, వ్యక్తి, వాగ్ధానాల కన్నా రాష్ట్రం కోసం ఆలోచించాలి. ఓటుతో మార్పు తీసుకురావాలి. ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అభివృద్ధి, మంచి పాలన కోసం ఓటు వేయడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత. సెలవు దినం కాదు, సమాజానికి సమర్పణ రోజు అని గుర్తుంచుకోవాలి.
☛రేపే జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్
News November 10, 2025
జూబ్లీ బైపోల్: BRS నాయకత్వానికి KCR కీలక ఆదేశాలు

జూబ్లీ బైపోల్కు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా BRS అధ్యక్షుడు KCR ఈ రోజు సాయంత్రం KTR, హరీశ్ రావు, కొంతమంది ముఖ్యమైన BRS నాయకులతో సమావేశం కానున్నారు. రేపు పోల్ మేనేజ్మెంట్ కీలకమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓట్ల కోసం అధికారం, డబ్బును ఉపయోగించుకుంటుందని హెచ్చరించారు. పోలింగ్ స్థితిని పర్యవేక్షించడానికి కొన్ని ముఖ్యమైన పోలింగ్ బూత్ల వద్ద ప్రత్యేక BRS బృందాలను మోహరించనున్నట్లు సమాచారం.


