News May 11, 2024

హైదరాబాద్‌లో మోదీ చరిష్మా వర్కౌట్‌ అయ్యేనా?

image

మోదీ రాకతో‌ ఎల్బీస్టేడియం కాషాయమయమైంది.‌ శుక్రవారం సా. ఆయన రాజధాని పరిధిలోని నలుగురు MP అభ్యర్థులకు మద్దతుగా భాగ్యనగర్‌ జనసభ‌లో ప్రసంగించారు. INC పాలనలో‌ బాంబ్ బ్లాస్టు‌లు జరిగాయని విమర్శలు గుప్పించారు. BJP హయాంలో నగరంలో ఒక్క బ్లాస్ట్ జరగలేదన్నారు. హైదరాబాద్‌ అంటే తనకెంతో ఇష్టమని‌ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంతో‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మరి మోదీ చరిష్మా HYDలో వర్కౌట్‌ అయ్యేనా? మీ కామెంట్?

Similar News

News February 12, 2025

శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)

image

శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీ‌మిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

News February 12, 2025

కొత్తూరు: దర్గాను దర్శించుకున్న హీరో విశ్వక్ సేన్

image

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను ప్రముఖ సినీ హీరో విశ్వక్‌సేన్ దర్శించుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా లైలా హిట్ కావాలని కుటుంబసభ్యులతో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి దర్గాకు వస్తుండే వాడినని, ఈ మధ్యకాలంలో రాలేకపోయానన్నారు.

News February 12, 2025

HYD: ఈ నెల 17వరకు నుమాయిష్ పొడిగింపు

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్ జనవరి 3వ తేదీన ప్రారంభమైంది. నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. సందర్శకులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రత కారణాల దృష్ట్యా మొదటగా ఈనెల 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామని HYD సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల వినతి మేరకు ఈనెల 17 వరకు అనుమతి లభించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

error: Content is protected !!