News November 15, 2024
హైదరాబాద్లో విశాఖ యువకుడి మృతి

విశాఖపట్నం మల్కాపురం ప్రాంతానికి చెందిన దేవకుమార్ గురువారం రాత్రి తన స్నేహితునితో బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నాడు. ఈ ఘటన హైదరాబాద్లో జరగింది. ప్రమాదంలో దేవకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. దేవకుమార్ స్నేహితుడు విజయవాడ వాసిగా గుర్తించారు. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News April 17, 2026
భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులోని మంగవారిపేట జంక్షన్ వద్ద గురువారం ఓ కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. నగర పర్యాటనకు వచ్చిన హైదరాబాద్కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డారు. సీసీ కెమెరా స్తంభాన్ని కూడా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బీచ్ పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.
News April 17, 2026
విశాఖలో మురుగునీటి శుద్ధికి ₹500 కోట్లు

విశాఖ గ్రేటర్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అనుసంధానానికి ₹500 కోట్లు వ్యయం చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 25% నిధులు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 75% నిధులు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.
News April 17, 2026
విశాఖలో మురుగునీటి శుద్ధికి ₹500 కోట్లు

విశాఖ గ్రేటర్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అనుసంధానానికి ₹500 కోట్లు వ్యయం చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 25% నిధులు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 75% నిధులు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.


