News July 14, 2024
హైదరాబాద్లో NDRF బృందాలను దించండి: దాన కిషోర్

నగరంలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పర్యటించారు. నగరంలోని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గంచెరువు, నెట్రన్ గార్డెన్కు వెళ్లారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలన్నారు.
Similar News
News October 14, 2025
RR: ‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు ఇవ్వొద్దు’

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా, అక్రమాలకు తావు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మంగళవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ వనజాత, డీఏఓ ఉష తదితరులు పాల్గొన్నారు.
News October 14, 2025
రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవు

రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. మద్యం టెండర్ల దాఖలు కోసం మరో 4 రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 249 మద్యం షాపులకు గాను కేవలం 1,253 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వైన్ షాపులకు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పోటీ ఉండేది. కానీ రియల్ ఎస్టేట్ ప్రభావం వైన్స్ టెండర్లపై పడింది.
News October 14, 2025
రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

RR జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ-15, ఇతర శాఖలు-33, మొత్తం 48 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.