News March 20, 2025
హైదరాబాద్లో OYO 2.O!

HYDలో OYOకు డిమాండ్ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్లైన్లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది
Similar News
News January 11, 2026
వరంగల్లో PDS బియ్యం సీజ్.. వ్యాపారుల కుమ్ములాట..!

రేషన్ బియ్యం దొంగల వ్యవహారం బయట పడింది. వరంగల్కు చెందిన రెండు వర్గాలు హన్మకొండలో రేషన్ బియ్యం దందా చేసే వారికి అమ్ముకునేందుకు ఉర్సుగుట్ట వద్ద ఓగోడౌన్లో 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం దాచారు. పోలీసులు గోడౌన్ పై దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హన్మకొండ వ్యాపారుల వల్లే బియ్యం పట్టుకున్నారని వరంగల్ వ్యాపారులు గొడవపడగా స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
News January 11, 2026
ప్రకాశం: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటుచేశారు.
News January 11, 2026
మీడియా సహాకారంతో వైకుంఠ ఏకాదశి సక్సెస్: కలెక్టర్

వైకుంఠ ఏకాదశి పదిరోజుల పాటు విజయవంతంగా నిర్వహించడంలో అన్ని విభాగాల సమన్వయం, ముఖ్యంగా మీడియా సహకారం కీలకమైందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సిబ్బందికి ప్రత్యేక అభినందన సమావేశంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. దర్శన వివరాలు భక్తులకు చేరవేయడంలో మీడియా పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో, జేఈవో, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.


