News October 1, 2024
హైదరాబాద్లో STAY ALERT
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. మరో 2 గంటలు నగరంలో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా మణికొండ, మాదాపూర్, KPHB, బాలానగర్, నార్సింగి, అత్తాపూర్, మియాపూర్, ట్యాంక్బండ్ పరిసరాల్లో వర్ష సూచన ఉందన్నారు. ఇప్పటికే నార్సింగిలో వాన దంచికొడుతోంది.
SHARE IT
Similar News
News October 1, 2024
HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’
తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.
News October 1, 2024
HYD: దేవాలయాల్లోని ప్రసాదాలకు FOOD లైసెన్స్
HYDలోని పలు దేవాలయాల్లో విక్రయించే ప్రసాదాలకు ఫుడ్ లైసెన్సులు జారీ చేశారు. ఇందులో SEC-మహంకాళి టెంపుల్, బల్కంపేట-ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానం, కర్మాన్ఘాట్-హనుమాన్ దేవస్థానం, ఎస్పీరోడ్డు-వీర హనుమాన్ దేవస్థానం, సనత్ నగర్- హనుమాన్ దేవస్థానం, జూబ్లీహిల్స్-పెద్దమ్మ దేవాలయం, వివేక్ నగర్ హనుమాన్ దేవాలయం, RTC క్రాస్ రోడ్డు లక్ష్మీగణపతి దేవస్థానం,మినిస్టర్ రోడ్డు శ్రీసాయిబాబ సమాజం, SEC-గణేష్ టెంపుల్ ఉన్నాయి.
News October 1, 2024
సోనూసూద్ వద్దకు దామగుండం సమస్య
దామగుండం అటవీ సమస్యను పూడూరు నాయకులు నటుడు, సామాజికవేత్త సోనుసూద్కు వివరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటైతే అడవి పూర్తిగా నాశనం అవుతుందని వాపోయారు. దీని ఏర్పాటుకు అడవిలో మొక్కలు, వృక్షాలు నరికేస్తారని, మూగజీవాలు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి పరిశోధించి ఆ తర్వాత కార్యచరణ చెబుతానని ఆయన భరోసా ఇచ్చారు.