News May 14, 2024
హైదరాబాద్: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!
రాజధాని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోక్సభలో 30 మంది, సికింద్రాబాద్లో 45, మల్కాజిగిరిలో 43, చేవెళ్లలో 22, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత HYD రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
Similar News
News October 7, 2024
సికింద్రాబాద్: FAKE టిక్కెట్లు అమ్ముతున్నారు.. జర జాగ్రత్త..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆపరేషన్ ఉపలబ్ద్లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంగా రైల్వే ఫేక్ టికెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.567 విలువ చేసే లైవ్ టికెట్, రూ.8,409 విలువ చేసే ఇతర టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ టికెట్లు ఆల్రెడీ ఉపయోగించినట్లు గుర్తించారు. స్టేషన్కు వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. SHARE IT
News October 7, 2024
HYD: బీసీ కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: గోపిశెట్టి
తెలంగాణలో బీసీ కులగణన చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కాచిగూడ మున్నూరుకాపు భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించారు. జెల్లి సిద్ధయ్య, మణికొండ వెంకటేశ్వరరావు, మంగళారపు లక్ష్మణ్, ఆత్మకూరి ప్రీతి, పొన్న సునీత పాల్గొన్నారు.
News October 7, 2024
HYD: ఈనెల 14 నుంచి 19 వరకు కౌన్సెలింగ్
వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన అనుబంధ యూజీ కోర్సులకు ఈనెల 14 నుంచి 19 వరకు HYD రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు. ప్రతీ రోజు ఉ.9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు www.pjtsau.edu.in వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.