News August 6, 2024
హైదరాబాద్: ఆగస్టు 21న భారత్ బంద్కు పిలుపు

SC, ST రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్టు 21న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణస్వరూప్ కోరారు. నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశం అయ్యారు. INC సహకారంతో మోదీ ఈ తీర్పు చెప్పించారని విమర్శించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు బంద్లో పాల్గొనాలన్నారు.
Similar News
News November 1, 2025
HYD: చంద్రబాబు ఫొటోతో ప్రచారం.. కాంగ్రెస్ VS BJP

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు ఫొటోలు, TDP జెండాలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల BJP ర్యాలీలో TDP జెండాలు కనిపించగా తాజాగా కాంగ్రెస్ ర్యాలీలో చంద్రబాబు ఫొటో కనిపించింది. అయితే కాంగ్రెస్ నేతలపై సరూర్నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ NDA మిత్రపక్ష నేత, AP CM చంద్రబాబు ఫొటోను కాంగ్రెసోళ్లు వినియోగించడం సిగ్గు చేటన్నారు.ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
News November 1, 2025
HYD: కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి: మంత్రి

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు రహమత్నగర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ నగర్ నుంచి ప్రతిభ నగర్ వరకు నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని, నవీన్ యాదవ్ని గెలిపించాలని కోరారు.
News November 1, 2025
HYD: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపుల కలకలం

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది. ఇండిగో ఫ్లైట్-68 ల్యాండింగ్ ఆపాలని హెచ్చరిక అందడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానంలో IED, నర్వ్ గ్యాస్ ఉండొచ్చని అనుమానంపై BTAC అత్యవసర సమావేశం జరిగింది. ఫ్లైట్ను ముంబై ఎయిర్పోర్టుకు మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. GMR సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రతా విభాగాలు మెయిల్ను పరిశీలిస్తున్నాయి.


