News August 10, 2024

హైదరాబాద్: గ్రేటర్‌లో గ్రెయిన్ ఏటీఎంలు

image

రేషన్ కష్టాలను తీర్చేందుకు గ్రేటర్ పరిధిలో గ్రెయిన్ ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 24 గంటలపాటు 365 రోజులు రేషన్ పొందేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏటీఎం 5 నిమిషాల్లో 50 కిలోల బియ్యం పంపిణీ చేస్తుంది. గంటకు 0.6 వాట్స్ విద్యుత్తు శక్తి అవసరమవుతుంది. సౌర విద్యుత్తుతోనూ నడిచే అవకాశం ఉండడంతో సౌర ప్యానెళ్లు బిగిస్తే 24 గంటలూ లబ్దిదారులకు అందుబాటులో ఉంటుంది.

Similar News

News November 1, 2025

సిటీ ఆర్టీసీ బస్సులో ఫైర్ ప్రొటెక్షన్ యంత్రాలు

image

కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో నగరంలోని సిటీ బస్సుల్లో ఫైర్ ప్రొటెక్షన్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రోడీలక్స్ బస్సులలో ఫైర్ ఎగ్జిటింగిషర్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వీటిని ఉపయోగించి మంటలను ఆర్పవచ్చు.

News November 1, 2025

HYD: కొత్త మంత్రి అజహరుద్దీన్ శాఖలపై ఉత్కంఠ!

image

కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ శాఖల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. అజహరుద్దీన్ మైనారిటీ సంక్షేమం, హోం శాఖలను పొందుతారని ఊహాగానాలు వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వం ఒక రోజులోనే కొత్త మంత్రుల శాఖలను ప్రకటిస్తుంది. కాగా రేవంత్ మంత్రివర్గంలోని మంత్రులు తమ ప్రస్తుత శాఖలను కోల్పోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. మరి ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారో చూడాలి. దీనిపై మీ కామెంట్?

News November 1, 2025

జూబ్లీ బైపోల్: విచిత్ర హామీలు.. విస్తుపోతున్న ఓటర్లు

image

నవ్విపోదురు గాక నాకేటి.. అన్నట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు విచిత్ర హామీలను ఇస్తున్నారు. ‘మీ అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు పెట్టిస్తాం.. స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయిస్తాం.. మీ సంక్షేమ సంఘం కార్యాలయానికి పెద్ద.. పెద్ద టీవీలను ఇస్తాం’ అంటూ ఓటర్ల వద్ద ఇష్టమొచ్చిన హామీలిస్తున్నారు. ‘అయినా గెలిచిన తరువాత మాకు కనిపిస్తారా ఏంటి?’ అని ఓటర్లు తమలో తాము అనుకుంటున్నారు.