News April 19, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల
> విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
> చిలుకూరు బాలాజీ టెంపుల్ కి క్యూ కట్టిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
> KPHBలో రూ.లక్ష నగదు సీజ్ చేసిన పోలీసులు
> రోడ్డు ప్రమాదంలో సరూర్ నగర్ PS కానిస్టేబుల్ మృతి
> HYD సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ టెన్షన్
> సనత్ నగర్‌లో కాంగ్రెస్ కార్యకర్త మృతి
>బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులఅరెస్ట్

Similar News

News November 8, 2025

హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

image

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 8, 2025

జూబ్లీ బైపోల్: చనిపోయిన ఓటర్ల వివరాల సేకరణ

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి వివిధ పార్టీల కార్యకర్తలు మరణించిన ఓటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎంతమంది మరణించారు.. ఎంతమందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి అనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ రోజు ఎవరైనా మృతి చెందిన ఓటరు పేరున వచ్చి ఓటు వేసే ప్రమాదముండటంతో ముందుజాగ్రత్త చర్యగా.. పోలింగ్ కేంద్రంలో అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

News November 8, 2025

సికింద్రాబాద్: బెర్తులు ఖాళీ.. బుక్ చేసుకోండి!

image

సిటీ నుంచి వెళ్లే పలు రైళ్లకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.. బుక్ చేసుకోండి అంటూ స్వయంగా రైల్వే అధికారులే చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి, చర్లపల్లి నుంచి దానాపూర్, విశాఖపట్టణం, కాకినాడ, ధర్మవరం, తిరుచానూరు, నర్సాపూర్, కాచిగూడ నుంచి తిరుచానూరుకు వెళ్లే రైళ్లల్లో బెర్తులు నేటి నుంచి 13 వరకు ఖాళీలున్నాయని CPRO శ్రీధర్ తెలిపారు. మరెందుకాలస్యం.. ప్రయాణాలుంటే బుక్ చేసుకోండి మరి.