News October 4, 2024
హైదరాబాద్ -నరసాపురం మధ్య ప్రత్యేక రైలు

నరసాపురం, హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 30 వరకు ప్రతి శని, ఆదివారాల్లో రైలు నంబర్ 07631 శనివారం రాత్రి 11.15కి హైదరాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ఆదివారం రాత్రి 8గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6గంటలకు హైదరాబాద్ వెళుతుంది. విజయవాడ, గుంటూరు మీదుగా ఈ రైలు నడుస్తుందన్నారు.
Similar News
News October 29, 2025
ప.గో. కలెక్టర్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తతపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సమీక్షించారు. తుఫాన్ కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలపై ముఖ్యమంత్రికు జిల్లా కలెక్టర్ వివరించారు. తుఫాన్ ప్రభవాన్ని ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ ఉండాలని సీఎం సూచించారు.
News October 29, 2025
4,155 మందికి పునరావాసం: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.
News October 28, 2025
4,155 మందికి పునరావాసం: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.


