News July 31, 2024
హైదరాబాద్: పంజాగుట్టలో ACB రైడ్స్

నగరంలోని పంజాగుట్ట సర్కిల్ ప్రాంతంలో ACB అధికారులు రైడ్స్ చేశారు. పంజాగుట్ట సర్కిల్ వన్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫైనల్ ఆడిట్ క్లియర్ చేసేందుకు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు రావడంతో రైడ్స్ చేసినట్లు వెల్లడించారు.
Similar News
News November 16, 2025
నగరంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

HYD పరిసరాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. GHMC పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ HYDలో 10 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా BHEL 11.4, రాజేంద్రనగర్ 11.9, శివరాంపల్లి 12.2, గచ్చిబౌలి 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ముక్కు, చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.
News November 16, 2025
శంషాబాద్: విమానంలో స్మోకింగ్ చేసిన ప్రయాణికుడు

విమానంలో పొగ తాగిన ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. రియాద్ నుంచి ఇండిగో విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు శంషాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగినట్లు ఎయిర్లైన్స్ సిబ్బంది గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 16, 2025
HYD: కులాంతర వివాహం.. పెట్రోల్ పోసి తగులబెట్టారు!

కులాంతర వివాహానికి సహకరించాడని హత్య చేసిన ఘటన షాద్నగర్లో జరిగింది. బాధితుల ప్రకారం.. ఎల్లంపల్లివాసి చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన యువతిని 10రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్ వివాహానికి అన్న రాజశేఖర్ సహకరించాడని భావించి యువతి బంధువులు 12న రాజశేఖర్ను మాట్లాడదామని పిలిచి కొట్టి హతమార్చారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


