News March 20, 2025

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో రద్దీ

image

సమ్మర్ ఎఫెక్ట్‌తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్‌పేట స్టేషన్‌‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్‌ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్‌లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్‌‌లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్‌కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.

Similar News

News November 17, 2025

NIMSలో నర్సులకు డయాబెటిస్ సంరక్షణపై ప్రత్యేక శిక్షణ

image

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా సోమవారం నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం నర్సింగ్ సిబ్బంది కోసం ‘డయాబెటిక్ పేషెంట్ కేర్’ పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. హెచ్.ఓ.డి. ప్రొఫెసర్ ఎం.వి.ఎస్. సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మధుమేహ రోగుల కౌన్సెలింగ్, ఇన్సులిన్ వినియోగం, డయాబెటిక్ కిటోఆసిడోసిస్ (DKA), హైపోగ్లైసీమియా వంటి అత్యవసర పరిస్థితుల నిర్వహణపై లోతైన అవగాహన కల్పించారు.

News November 17, 2025

NIMSలో నర్సులకు డయాబెటిస్ సంరక్షణపై ప్రత్యేక శిక్షణ

image

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా సోమవారం నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం నర్సింగ్ సిబ్బంది కోసం ‘డయాబెటిక్ పేషెంట్ కేర్’ పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. హెచ్.ఓ.డి. ప్రొఫెసర్ ఎం.వి.ఎస్. సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మధుమేహ రోగుల కౌన్సెలింగ్, ఇన్సులిన్ వినియోగం, డయాబెటిక్ కిటోఆసిడోసిస్ (DKA), హైపోగ్లైసీమియా వంటి అత్యవసర పరిస్థితుల నిర్వహణపై లోతైన అవగాహన కల్పించారు.

News November 17, 2025

HYD: బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్

image

నగరంలో పెరుగుతున్న కాలనీలు, జనాభా, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలంటూ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్ వంటి ప్రాంతాల వారు సరిపడ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.