News March 20, 2025

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో రద్దీ

image

సమ్మర్ ఎఫెక్ట్‌తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్‌పేట స్టేషన్‌‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్‌ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్‌లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్‌‌లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్‌కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.

Similar News

News November 14, 2025

Round 1 Official: నవీన్ యాదవ్ 47 ఓట్ల లీడ్

image

జూబ్లీహిల్స్ బైపోల్‌ రౌండ్ 1 ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. తొలి రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు 8911 (+ 47) ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 (-47) ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి 2167 (-6744) ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో 42 బూత్‌లలో పోలైన ఓట్లను లెక్కించారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.

News November 14, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మిగిలిన 8 రౌండ్లు కీలకం

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో ఆయన ఆధిక్యం 1,144కు చేరింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్‌కు 9691, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ఇంకా 8 రౌండ్లు మిగిలి ఉండగా.. అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.