News March 20, 2025
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రద్దీ

సమ్మర్ ఎఫెక్ట్తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్పేట స్టేషన్కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.
Similar News
News March 29, 2025
రంగారెడ్డిలో అత్యధికం ఉష్టోగ్రత ఇక్కడే..!

రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. యాచారం, మంగల్పల్లిలో 41.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. చందనవెల్లి 41.3, రెడ్డిపల్లె, చుక్కాపూర్ 41.2, ప్రొద్దుటూరు 41.1, నల్లవెల్లి, కేశంపేట 41, మీర్ఖాన్పేట, కొత్తూర్ 40.9, మామిడిపల్లె, పెదఅంబర్పేట్, తొమ్మిదిరేకుల 40.8, మొగల్గిద్ద, కాసులాబాద్ 40.7, కేతిరెడ్డిపల్లి 40.6, మొయినాబాద్ 40.5, తట్టిఅన్నారం, షాబాద్ 40.4, కోంగరకలాన్లో 40.3℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 29, 2025
కూకట్పల్లి: డబ్బులు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తి అదృశ్యం

ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.
News March 29, 2025
ఉగాదికి కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం సిద్ధం

ఉగాది పండగ సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం సర్వం సిద్ధం ఐనట్లు ఆలయ EO లావణ్య తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక లైన్, ప్రసాద కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండగ పురస్కరించుకొని ఆదివారం సా 6లకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కావున భక్తులు పంచాంగ శ్రవణ ఫలితాన్ని విని తరించాలని కోరారు.