News June 24, 2024
హైదరాబాద్ శివారులో మాజీ MPTC హత్య

హైదరాబాద్ శివారులో మాజీ MPTC హత్యకు గురయ్యారు. ఘట్కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ PSలో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా NFCనగర్ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
GHMC ఎన్నికలకు సిద్ధం కావాలి: KTR

ఓడిన చోటే గెలిచి చూపిద్దామని, GHMC ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సూచించారు. బుధవారం HYD బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దొంగ ఓట్లు, అక్రమాలతోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు.
News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.


