News March 23, 2024
హైదరాబాద్: BRSలో అలజడి..!

GHMC మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమెతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో BRS 56 స్థానాలు గెలుచుకోగా.. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే 10 మంది పార్టీని వీడారు. మరో 15 మంది కార్పొరేటర్లను ఆకర్షించాలని INC భావిస్తోందట. ఇదిలా ఉంటే ఒక్కొక్కరుగా పార్టీని వీడడం HYD BRSలో అలజడి రేపుతోంది.
Similar News
News February 12, 2026
HYDలో డెంగీ కేసులు.. అసలు నిజం ఇదే!

కేంద్ర ప్రభుత్వ సంస్థ NCVBDC డేటా ప్రకారం TGలో 2021లో కేవలం 220గా ఉన్న అనుమానిత చికెన్ గున్యా కేసులు 2024 నాటికి 13,592కు చేరుకున్నాయి. GHMC జనవరి 2026లో డెంగీ కేసులు 30% తగ్గాయని ప్రకటించింది. ఇది కేవలం ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన డేటా మాత్రమే. ఎక్కువ మంది ప్రైవేట్ క్లినిక్లకు వెళ్లడం, IHIP పోర్టల్లో డేటా నమోదులో జాప్యం వల్ల అసలు సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
News February 12, 2026
మల్కాజిగిరి కార్పొరేషన్: తూర్పు కోటలో రియల్ ఎస్టేట్ జాతర!

తూర్పు సిటీకి ఇప్పుడు ‘అదృష్టం’ పట్టింది. తార్నాక హుడా కాంప్లెక్స్ కేంద్రంగా మల్కాజిగిరి కార్పొరేషన్ తన ప్రస్థానం మొదలుపెట్టింది. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు దుబాయ్ రేంజ్ స్కై స్క్రాపర్లు కట్టేందుకు గవర్నమెంట్ రూట్ మ్యాప్ రెడీ చేసింది ప్రభుత్వం. ఆఫీసియల్ సమాచారం ప్రకారం, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు సెట్ చేసి పశ్చిమ నగరానికే సవాల్ విసరబోతున్నారు.
News February 12, 2026
ఓహో.. ‘బేగంపేట’కు ఆ పేరు ఇలా వచ్చిందా?

బేగంపేటకు ఉన్న చారిత్రక నేపథ్యం నిజాం కాలానికి చెందింది. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన కుమార్తె బషీర్ ఉన్నిసా బేగంకు ఉమ్రన్ అమిర్తో వివాహం చేశారు. ఆ సందర్భంగా కట్నంగా ఒక విలువైన స్థలాన్ని ఆమెకు దానం చేశారు. ఆ భూమి బషీర్ ఉన్నిసా బేగం పేరిట నమోదు కావడంతోనే కాలక్రమేణా ఆ ప్రాంతం ‘బేగంపేట’గా ప్రసిద్ధి చెందింది. నిజాం రాజవంశ వైభవానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.


