News April 28, 2024
హైదరాబాద్: MMTSలో SIని బెదిరించి చోరీ

MMTS రైలులో వెళుతున్న CRPF SIను బెదిరించిన ఆగంతకులు గొలుసు లాక్కెళ్లిన సంఘటన కాచిగూడ రైల్వే PS పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్లి వాసి ప్రసాద్(CRPF SI) శుక్రవారం రాత్రి MMTSలో ప్రయాణించారు. యాకుత్పుర-ఉప్పుగూడ స్టేషన్ల మధ్యన ముగ్గురు ఆగంతకులు కత్తితో బెదిరించి ఆయన మెడలోని 15 గ్రాముల బంగారు గొలుసు, రెండు సెల్ ఫోన్లు దొంగిలించారు. కేసు నమోదైంది.
Similar News
News April 19, 2026
HYDలో భారీ డిమాండ్..!

గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ రికార్డు సృష్టించింది. 2 రోజులుగా అత్యధికంగా 99- 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా మేలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడంతో మార్చి నుంచే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ఇదే సమయంలో ఆర్టిజన్లు సమ్మెకు దిగడంతో నిత్యం కరెంట్ కట్లతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడంలేనట్లు తెలుస్తోంది.
News April 19, 2026
TEDxHyderabad: ఆలోచనలకి పదును పెడదాం రండి!

నేడు గండిపేటలోని అక్షయ కన్వెన్షన్లో ‘FIRE-UP’ థీమ్తో TEDxHyderabad 2026 జరగనుంది. కేవలం మాటలే కాదు మార్పు దిశగా అడుగులు వేయడమే ఈ ఈవెంట్ ఉద్దేశం. స్పర్శ్ హాస్పిస్ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ‘ఛోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు వంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. 9AM నుంచి 5PM వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్య, ఆరోగ్యం, టెక్నాలజీపై చర్చలు సాగుతాయి.
News April 19, 2026
TEDxHyderabad: ఆలోచనలకి పదును పెడదాం రండి!

నేడు గండిపేటలోని అక్షయ కన్వెన్షన్లో ‘FIRE-UP’ థీమ్తో TEDxHyderabad 2026 జరగనుంది. కేవలం మాటలే కాదు మార్పు దిశగా అడుగులు వేయడమే ఈ ఈవెంట్ ఉద్దేశం. స్పర్శ్ హాస్పిస్ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ‘ఛోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు వంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. 9AM నుంచి 5PM వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్య, ఆరోగ్యం, టెక్నాలజీపై చర్చలు సాగుతాయి.


