News January 31, 2025
హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి తెలిపారు. ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాట్ల కోసం భూ సేకరణకు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
సూర్యాపేటలో 298 మ్యూల్ అకౌంట్స్ గుర్తింపు

TG పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్’లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంక్ బ్రాంచ్లలో 298 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 137 బ్రాంచ్లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు నిర్వహించింది. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో నేరగాళ్లు ఈ ఖాతాల ద్వారా సైబర్ దందాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. గతంలోనూ పలు గ్రామాల్లో సైబర్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
News February 26, 2026
క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, హన్మకొండ, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఖమ్మం డీవైఎస్వో సునీల్ రెడ్డి తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుండి 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన విద్యార్థులు మార్చి 4లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు 96036 49969 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News February 26, 2026
ఖమ్మం: రేషన్ అక్రమాలపై విజిలెన్స్ నిఘా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. నెలకు రెండుసార్లు గోదాములు, దుకాణాల్లో తనిఖీలు చేయనున్నారు. బియ్యం దళారులకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్ షిప్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నామని, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.


