News February 13, 2026
హోంమంత్రి అనిత పీఏలపై మళ్లీ వివాదం

హోంమంత్రి అనిత పీఏల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె మంత్రి పదవి చేపట్టిన వెంటనే జగదీష్ అనే పీఏపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను పక్కన పెట్టారు. ప్రస్తుత పీఏ గణేష్పై కూడా అక్రమ వసూళ్ల ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. పశువులను తరలించే వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కథనాలు SMలో వైరల్ కావడంతో ఆమె స్పందించారు. ఆరోపణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.
Similar News
News March 6, 2026
ట్రంప్పై విమర్శలతో విరుచుకుపడిన దుబాయ్ బిలియనీర్

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తల నేపథ్యంలో UAE బిలియనీర్ ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు గల్ఫ్ దేశాలు భారీగా నిధులిచ్చాయని.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. యుద్ధాలు ఉండవంటూనే ఇరాన్ సహా ఏడు దేశాలపై ఆపరేషన్స్ చేశారని మండిపడ్డారు. కాగా ఖలాఫ్ అహ్మద్ UAEలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి.
News March 6, 2026
ఉట్నూర్: ATCలో షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్లో భాగంగా నిర్వహించే అఖిల భారత వాణిజ్య పరీక్ష షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ కేటగిరీల వారీగా కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏదైనా సందేహాలు ఉంటే కళాశాలకు నేరుగా వచ్చి సంప్రదించాలన్నారు.
News March 6, 2026
సంగారెడ్డి: ఇంటి వద్దకే సీతారాముల ముత్యాల తలంబ్రాలు

శ్రీరామనవమి సందర్భంగా భక్తుల చెంతకే స్వామివారి ముత్యాల తలంబ్రాలను చేరవేసే కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ గురువారం దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆసక్తి గల భక్తులు 151 రూపాయలు చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు అందేలా ఈ వినూత్న సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు.


