News October 24, 2024

హోంశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే జయసూర్య

image

హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ పగిడ్యాల మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి గురువారం కలిశారు. నియోజకవర్గంలో జరగాల్సిన పనులపై, వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 26, 2025

వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

image

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News October 26, 2025

వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

image

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News October 26, 2025

బస్సు ప్రమాద ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి: SV

image

కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బైకర్ శివ శంకర్ లక్ష్మీపురం వద్ద బెల్టు షాపులో మద్యం తాగి వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారని వాపోయారు. రాష్ట్రంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని ఆరోపించారు. ఎక్సైజ్ మంత్రిపై కేసు నమోదు చేసి, బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.