News February 25, 2025

హోరెత్తితున్న MLC ఎన్నికల చివరి రోజు మొబైల్ ప్రచారం

image

ఉభయగోదావరి జిల్లాలో నిర్వహించనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లు మొబైల్ ఫోన్ కలిగి ఉండడంతో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అభ్యర్థులు, పలువురి అధికారుల రికార్డింగ్ వాయిస్‌‌తో ఫోన్‌లు చేస్తున్నారని ఓట్లరు అంటున్నారు. ప్రతి 5నిమిషాలకు ఫోన్ రావడంతో ఓటర్లు విసుగుచెందుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్‌ అండ్‌ రన్ కేసులో మరణించిన పెద్దింటి లక్ష్మీనారాయణ భార్య పెద్దింటి రంగమ్మకు రూ.2 లక్షలు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హిట్ అండ్ రన్‌‌ కేసుల్లో 101 మంది బాధితులకు మొత్తం రూ.82లక్షలు అందించినట్లు చెప్పారు.

News December 11, 2025

షాద్‌నగర్ MLA స్వగ్రామంలో BRS గెలుపు

image

షాద్‌నగర్ MLA స్వగ్రామం నందిగామ మండలంలోని వీర్లప్లలిలో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు ఢంకా మోగించారు. వీర్లపల్లి గ్రామ సర్పంచ్‌గా పాండు గెలుపు టాక్ ఆఫ్ ది నియోజకవర్గంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వారు తెలిపారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

News December 11, 2025

కడప: గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వర్ధంతి

image

కడప జిల్లా వాసులు గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని మరువలేరు. ఆమె గానం చేసిన వేంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రతి శనివారం ఉదయం కడప ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచి ప్రసారమవుతుంది. ఆమె పాటలు గుండెల్లో గుర్తుండిపోయాయని, ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె గానం ఎప్పుడూ గుర్తుంటుందని కడప వాసులు గురువారం ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నారు.