News August 13, 2024
హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణంతో వరద నీటికి చెక్

రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా బల్దియా చర్యలు చేపట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మిస్తోంది. ఇందుకు లక్ష, 5లక్షలు, 10లక్షల లీటర్ల కెపాసిటీతో పాయింట్ల వారీగా ట్యాంకుల నిర్మాణాలను చేపడుతోంది. గ్రేటర్ సిటీలో రూ.10కోట్లతో 50 ప్రాంతాల్లో నిర్మించనుంది. ఇటీవల అసెంబ్లీ సెషన్స్లోనూ వీటిపైన సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు.
Similar News
News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్లో ఓట్లేయడానికి వస్తారా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లున్నారు. ఇంతవరకు జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 2009లో 52% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో (2023)లో అయితే కేవలం 47.49%. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. పోల్ పర్సెంటేజీ పెరిగితే ఆ ఓటింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది 14నే తెలుస్తుంది. అంతా పర్సెంటేజీపైనే ఆధారపడి ఉంటుంది.
News November 8, 2025
జూబ్లీ బై పోల్: ఏజెంట్లకు గమనిక.. రేపు సాయంత్రం వరకే పాసులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏజెంట్లుగా కూర్చునే వారికి ఎన్నికల అధికారులు కీలక సూచనలు చేశారు. 11న ఎన్నికలు జరుగుతుండటంతో వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎంపికైన ఏజెంట్లు పాసులు 10వ తేదీ సాయంత్రం లోపు తీసుకోవాల్సి ఉంటుంది. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు స్థానిక బూత్తో అధికారులను కలిసి పాసులు పొందాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. వీరంతా 11న ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలన్నారు.
News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: టార్గెట్ లక్ష ఓట్లు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాయకులు ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్ని ఓట్లు వస్తే గెలిచే అవకాశముంటుంది.. ఎంత పోలింగ్ శాతం నమోదైతే తమ విజయావకాశాలుంటాయని మ్యాథమ్యాటిక్స్ నిపుణలయిపోతున్నారు. మొత్తం 4,01,365 ఓట్లలో 50% పోల్ అయితే (అంటే 2 లక్షలు) గెలిచేందుకు లక్ష ఓట్లు వస్తే చాలన్నమాట.. అందుకే టార్గెట్ లక్ష అంటూ నాయకులు ఎవరికి వారు ఊహాలోకాల్లో మునిగిపోతున్నారు.


