News March 14, 2025

హోళీ పండుగపై కడప ఎస్పీ సూచనలు

image

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హోళీ పండుగ శుభాకాంక్షలతో పాటు పలు సూచనలు చేశారు. హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలన్నారు. అన్ని మతాలవారు మతసామరస్యం పాటిస్తూ ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ బాధ్యతతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా హద్దులు దాటితే ఉపేక్షించమని, ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.

Similar News

News March 14, 2025

మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

image

మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పి. చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మైదుకూరు పట్టణంలో నివాసం ఉంటున్న వీరు పొలం పనులు చూసుకొని తిరిగి వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కావడంతో చికిత్స కోసం తరలించారు.

News March 14, 2025

PDTR: ఆసుపత్రిలో దొంగతనానికి విఫలయత్నం

image

ఆసుపత్రిలోనే డాక్టర్ చైన్ కొట్టేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ శ్రీవాణి గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ రూము వైపు వెళ్తుండగా.. మెట్ల వద్ద ఓ వ్యక్తి ఆమె మెడలోని చైన్ లాగడానికి ట్రై చేశాడు. అతడిని వెనక్కి నెట్టేయగా.. మరోసారి చైన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. డాక్టర్ కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

News March 14, 2025

కడప: ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు.. ఎస్టీలకు రూ.75 వేలు

image

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో అసంపూర్ణంగా ఉన్న గృహాలకు ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేల చొప్పున సుమారు 25 వేల మందికి ఆర్థిక సాయం విడుదల చేస్తామన్నారు. ఈనెల 15నుంచి 23వ తేదీ వరకు సంబంధిత అధికారులు నిర్మాణాల వద్దకు వచ్చి చిత్రాలు తీసి అప్లోడ్ చేస్తారని స్పష్టంచేశారు.

error: Content is protected !!