News March 8, 2025
హోళీ సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

హోళీ సందర్భంగా విజయవాడ మీదుగా తాంబరం(TBM), సత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 13,20న TBM- SRC(నం.06095), ఈనెల 14,21న SRC-TBM(నం.06096) ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో శ్రీకాకుళం రోడ్, పలాస, విజయనగరం, సింహాచలం నార్త్, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, గూడూరు స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 6, 2025
HYD: పురపాలికల విలీనంతో “చెత్త” సమస్యలు!

జీహెచ్ఎంసీలో 27 పురపాలిక సంస్థలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఉన్న అధికారులు వీటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంత మంది అధికారులు ఉన్నా సరే పాత జీహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. కొత్త ప్రాంతాలు రావడంతో ఇక పరిస్థితి ఎలా ఉంటుందని గుబులు మొదలైంది. వీటి కోసం కొత్త వారిని నియమిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.
News December 6, 2025
జగిత్యాల: స్థానిక ఎన్నికలు.. జోరుగా దావత్లు

జగిత్యాల జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దావతులు జోరుగా సాగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పురుష ఓటర్లకు ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేస్తున్నారు. వారితో కలిసి ప్రచారం చేసినవారికి రాత్రి కాగానే మందు, మాంసంతో పార్టీలు ఇస్తున్నారు. సంఘాలు, యూత్లు, వార్డుల వారీగా గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తూ వారి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
News December 6, 2025
HYD: పురపాలికల విలీనంతో “చెత్త” సమస్యలు!

జీహెచ్ఎంసీలో 27 పురపాలిక సంస్థలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఉన్న అధికారులు వీటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంత మంది అధికారులు ఉన్నా సరే పాత జీహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. కొత్త ప్రాంతాలు రావడంతో ఇక పరిస్థితి ఎలా ఉంటుందని గుబులు మొదలైంది. వీటి కోసం కొత్త వారిని నియమిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.


