News February 16, 2025

హ్యూమన్ రైట్స్ బాపట్ల జిల్లా ఛైర్మన్‌గా శివప్రసాద్

image

హ్యూమన్ రైట్స్ బాపట్ల జిల్లా ఛైర్మన్‌గా వెంకట నాగ శివప్రసాద్‌ను నియమిస్తూ జాతీయ ఛైర్మన్ సిరాజుద్దీన్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. బాపట్ల జిల్లాలో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం నుంచి అందవలసిన పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 21, 2025

ములుగు జిల్లా పర్యాటకానికి ఊతమివ్వండి: కేంద్ర మంత్రికి సీతక్క వినతి

image

ములుగు జిల్లాలో ఎకో ఫ్రెండ్లీ టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌‌కు రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను కలిసిన సీతక్క ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. మల్లూరు దేవస్థానం అభివృద్ధికి రూ.30 కోట్లు, బోగత జలపాతం అభివృద్ధికి రూ.50 కోట్లు, మేడారం జంపన్న వాగు అభివృద్ధికి మరో రూ.50 కోట్ల నిధులను కేటాయించాలని కోరారు.

News November 21, 2025

మేడారం జాతరకు రండి.. రాష్ట్రపతిని ఆహ్వానించిన సీతక్క

image

మేడారం మహా జాతరకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్ర మంత్రి సీతక్క ఆహ్వానించారు. HYD బొల్లారంలో జరిగిన భారతీయ కళా మహోత్సవ్ -2025 కార్యక్రమంలో ఈమేరకు రాష్ట్రపతికి తెలంగాణ సమాజం తరఫున ఆహ్వానం పలికారు. జాతరలో పాల్గొంటే ఆదివాసీ గిరిజనులకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. ఒడిశాకు చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, త్రిపురకు చెందిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆదివాసీ మూలాలు ఉన్నాయన్నారు.

News November 21, 2025

మరికొన్ని గంటల్లో భారీ వర్షం

image

AP: బంగాళాఖాతంలో రేపు <<18351099>>అల్పపీడనం<<>> ఏర్పడనున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి రేపు ఉ.9 గంటల వరకు తిరుపతి, నెల్లూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రేపు మధ్యాహ్నానికి చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే.