News January 6, 2025
ఏడాదిలో ₹లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది: KTR
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ₹లక్షన్నర కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఏమైందని KTR ప్రశ్నించారు. ‘6 గ్యారంటీలు, రుణమాఫీ, రైతు భరోసా, ₹4వేల పింఛను, మహిళలకు ₹2,500, తులం బంగారం ఇవ్వనేలేదు. అయినా అప్పు ఎందుకయింది?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. BRS ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నో పథకాలు ఇచ్చిందని, పదేళ్లలో ₹4 లక్షల కోట్ల అప్పు చేసిన KCR సర్కారుపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News January 25, 2025
పద్మవిభూషణులు వీరే
1. దువ్వూరు నాగేశ్వర రెడ్డి(వైద్యం)- తెలంగాణ
2. జగదీశ్ సింగ్ ఖేహర్ (ప్రజా వ్యవహారాలు)- చండీగఢ్
3. కుముదిని రజనీకాంత్ లఖియా (కళలు)- గుజరాత్
4. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం (కళలు)- కర్ణాటక
5. ఎం.టీ. వాసుదేవన్ నాయర్ (లేటు) (సాహిత్యం) – కేరళ
6. ఒసాము సుజుకీ (లేటు) (వాణిజ్యం) – జపాన్
7. శారదా సిన్హా (లేటు) (కళలు)- బిహార్
News January 25, 2025
బాలకృష్ణకు సీఎం చంద్రబాబు అభినందనలు
AP: పద్మభూషణ్ పురస్కారం పొందిన నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు అభినందించారు. లెజండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు, సేవా రంగాల్లో రాణిస్తున్నారని కితాబిచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అంకితభావంతో చేసిన సేవ వేల మంది జీవితాలను తాకిందని, లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చిందని మెచ్చుకున్నారు. ఇది నిజమైన ఐకాన్, దయగల నాయకుడికి తగిన గౌరవం అని సీఎం పేర్కొన్నారు.
News January 25, 2025
బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ‘పద్మ భూషణ్ పురస్కారం లభించినందుకు కంగ్రాట్స్ బాలా బాబాయ్. సినీ పరిశ్రమకు, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కింది’ అని తారక్ కొనియాడారు.