News January 27, 2025
₹16k టికెట్ ₹60k: కుంభమేళా భక్తులపై ఎయిర్లైన్స్ దోపిడీ

దొరికిందే తడవుగా అందినకాడికి దోచుకొనేందుకు ఎయిర్లైన్స్ సిద్ధమయ్యాయి. మహా కుంభమేళాలో త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించాలనుకున్న భక్తులకు షాకిస్తున్నాయి. టికెట్ రేట్లను విపరీతంగా పెంచేశాయి. ముంబై, ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు ₹16k టికెట్ ఉండగా ఇప్పుడు ₹50k-60k వరకు ఛార్జ్ చేస్తున్నాయి. HYD నుంచీ అదే పరిస్థితి. ఫిర్యాదులు రావడంతో ఛార్జీలను రేషనలైజ్ చేయాలని DGCA ఆదేశించినట్టు తెలిసింది.
Similar News
News December 6, 2025
రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్పోర్ట్ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
News December 6, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ను ఎలా గుర్తించాలంటే?

బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 6, 2025
భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<


