News March 7, 2025

TG నుంచి APకి ₹1700cr ప్రాజెక్ట్.. ఇది సిగ్గు చేటు: KTR

image

TG: గతంలో BRS తీసుకొచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ కాపాడుకోలేకపోతోందని KTR విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.1700 కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ TG నుంచి APకి వెళ్లిపోయిందన్న సోషల్ మీడియా పోస్టుపై ఆయన స్పందించారు. ‘గుజరాత్‌కు కేన్స్, తమిళనాడుకు కార్నింగ్‌ను వదిలేశారు. ఇప్పుడు ప్రీమియర్ ఏపీకి వెళ్తోంది. ఇది సిగ్గు చేటు రాహుల్ గాంధీ’ అని ట్వీట్ చేశారు.

Similar News

News April 4, 2026

మహిళలను వేధించే వారిని ఉపేక్షించొద్దు: CBN

image

AP: మాచర్లలో ఉద్యోగినిపై అత్యాచారయత్న ఘటనలో నిందితుణ్ని త్వరగా అరెస్టు చేయాలని CM CBN పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పాలని సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని అధికారులు CMకు తెలిపారు. కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. బాధితురాలికి గుంటూరు GGHలో చికిత్స అందిస్తున్నామన్నారు.

News April 4, 2026

పాక్‌పై భారత్ మరోసారి దాడి చేస్తుందా?

image

పశ్చిమాసియా యుద్ధంతో పాక్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. దీన్నే అవకాశంగా మలుచుకొని దాయాదిని దెబ్బకొట్టాలని IND భావిస్తోందా? ఉగ్రవాదాన్ని పోషిస్తూ కంట్లో నలుసులా మారిన PAKను OpS-2తో నాశనం చేయడానికి సిద్ధమవుతోందా? త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీలు, పాక్‌కు <<19547918>>వార్నింగ్<<>>, రాష్ట్రాల్లో మాక్ డ్రిల్, ప్రజలకు 3 నెలల రేషన్(యుద్ధం వస్తే ఇబ్బంది పడకుండా) సరఫరా ఈ ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయి.

News April 4, 2026

BRS ఖాతాలో మరో రెండు మున్సిపాలిటీలు

image

TG: గతంలో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాలను BRS కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తాజాగా జరిగిన ఎన్నికలో రెండు మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. క్యాతనపల్లి ఛైర్మన్‌గా గొడిశెల సంధ్యారాణి, ఇబ్రహీంపట్నం ఛైర్మన్‌గా సుదర్శన్‌ రెడ్డి ఎన్నికయ్యారు.