News November 5, 2024
₹4000+Cr ప్రాఫిట్: 4 ఏళ్లలో తీసుకుంది ఐదుగురినే!

Zerodha టెక్ టీమ్ గత 4 ఏళ్లలో కొత్తగా ఐదుగురినే తీసుకుంది. టీమ్సైజ్ 35 మాత్రమే కావడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ₹4000 కోట్లకు పైగా ప్రాఫిట్ ఆర్జిస్తున్న ఈ కంపెనీ ఎక్కువగా AIపై ఆధారపడుతోందని తెలుస్తోంది. ఆర్డర్స్, ట్రాన్జాక్షన్స్ సహా చాలా పనుల్లో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ తక్కువేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ విధానం సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ల ఉపాధికి గండికొట్టొచ్చన్న భయాలూ పెరుగుతున్నాయి.
Similar News
News February 1, 2026
BUDGET: బడుల్లో ‘కంటెంట్ క్రియేట్’ పాఠాలు

బడ్జెట్-2026లో భాగంగా SM రంగంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ప్రభుత్వం ‘కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్’ను ప్రకటించింది. 2030 నాటికి 15 వేల పాఠశాలలు, 500 కళాశాలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీడియో ఎడిటింగ్, పాడ్కాస్టింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ ల్యాబ్స్ను IICT నిర్వహిస్తుంది. నిరుద్యోగాన్ని తగ్గించి, గ్రామీణ యువత కూడా ఇంటి నుంచే సంపాదించేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
News February 1, 2026
‘డబుల్ హ్యాపీ’ కవలలు పుట్టాక RC ఫస్ట్ పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ఉపాసన దంపతులకు <<19016319>>కవలలు<<>> జన్మించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా బాబు, ఆ తర్వాత పాప పుట్టినట్లు వైద్యులు తెలిపారు. రామ్చరణ్ తమ సంతోషాన్ని SM ద్వారా పంచుకుంటూ తన జీవితంలోని మహిళలే తనకు కొండంత బలమని రాసుకొచ్చారు. ముగ్గురు పిల్లలు కలగడం సంతోషంగా ఉందన్నారు. తమను ఆదరిస్తున్న అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది.
News February 1, 2026
తగ్గేదేలే.. డిఫెన్స్ బడ్జెట్ పైపైకి!

మిలిటరీ ఆధునికీకరణతో కలిపి మొత్తంగా ఈసారి బడ్జెట్లో డిఫెన్స్కు కేంద్రం ₹7.85లక్షల కోట్లను కేటాయించింది. రక్షణ రంగానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనం. పదేళ్లలో ఈ కేటాయింపులు భారీగా పెరిగాయి. 2015-16లో ఇది ₹2.94లక్షల కోట్లకే పరిమితం కాగా క్రమంగా కేంద్రం పెంచుతోంది. ఆత్మనిర్భరత సాధించేందుకు ప్రయత్నిస్తున్న భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత డిఫెన్స్పై మరింత దృష్టిసారించింది.


