News March 23, 2024
నన్ను కలవాలంటే గంటకు ₹5 లక్షలు ఇవ్వాలి: డైరెక్టర్

ఇక నుంచి ఎవరైనా తనను కలవాలనుకుంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెలిపారు. ఇప్పటికే చాలా టైమ్ వృథా చేశానని, కొత్త వ్యక్తుల్ని కలవడానికి తన దగ్గర టైమ్ లేదని ఆయన తన ఇన్స్టా పోస్టులో పేర్కొన్నారు. తనను కలవాలంటే అరగంటకు ₹2లక్షలు, గంటకు ₹5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే తనకు కాల్స్, మెసేజెస్ చేయొద్దని రాసుకొచ్చారు. షార్ట్ కట్స్ వెతుక్కునే వారంటే తనకు నచ్చదని చెప్పారు.
Similar News
News February 18, 2026
ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.
News February 18, 2026
ప్రకృతి వ్యవసాయంలో APCNF కీలక పాత్ర

రైతులను రసాయన రహిత వ్యవసాయంవైపు నడిపించాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం APCNF(Andhra Pradesh Community Managed Natural Farming) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన సేద్యం కాకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్రంలో వేలాది మంది రైతులు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ మానవ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.
News February 18, 2026
NBCC 59పోస్టులకు నోటిఫికేషన్

నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (<


