News September 19, 2025
అంకిత భావ సేవలతో పని చేయాలి: కలెక్టర్

రెవెన్యూ అధికారులు నిబద్ధత అంకిత భావ సేవలతో పని చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో రెవెన్యూ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జీవో నంబర్ 55 ప్రకారం దసరా సందర్భంగా మండపాలు రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 19, 2025
అసాంఘిక కార్యకలాపాలను రూపమాపాలి: ADB ఎస్పీ

రానున్న నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణను అవలంభించాలని సూచించారు. అందులో భాగంగానే కల్తీకల్లు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపమాపేలా కృషి చేయాలన్నారు.
News September 19, 2025
GDK: సుబ్రహ్మణ్యం నిర్ణయాలతో కంపెనీకి లాభాలు: లలిత్

సింగరేణి సంస్థలో GM(CCO) కార్పొరేట్ విభాగంలో విధులు నిర్వహించి సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయాలతో కంపెనీకి లాభాలు చేకూర్చారని రామగుండం సింగరేణి సంస్థ RG-1 GMలలిత్ కుమార్ అన్నారు. ఈనెల చివరన ఆయన పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా స్థానిక సింగరేణి GMకార్యాలయంలో ఆత్మీయంగా సన్మానించారు. అధికారులు రవీందర్ రెడ్డి, బ్రహ్మాజీరావు, సుభాశ్, కృష్ణ ప్రసాద్, శ్రీధర్, నరసింహారెడ్డి, రాజేందర్, తిరుపతి ఉన్నారు.
News September 19, 2025
సంగీత రంగంలో జుబీన్ సేవలు అనిర్వచనీయం: PM మోదీ

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ <<17761932>>మరణంపై<<>> ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సంగీత రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. తన పాటలతో అన్ని వర్గాల ప్రజలను అలరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి జుబీన్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి ఉంటారని ట్వీట్ చేశారు.