News October 1, 2025

అంకుల్ మీతో వస్తాం.. అన్నం పెడతారా!

image

తల్లిని కోల్పోయారు. తండ్రి ఆదరణ లేదు. ఆ ఇద్దరు చిన్నారులకు దిక్కుతోచని స్థితి. ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే దారిలో హెల్ప్ సంస్థ పీడీ సాగర్‌కు ఆ ఇద్దరూ తారసపడ్డారు. ఒకరు 7 ఏళ్ల బాలుడు. మరొకరు 8 ఏళ్ల బాలిక. వీరిని సాగర్ పలకరించి వివరాలు కోరగా అమ్మ చనిపోయిందని, నాన్న ఎక్కడున్నాడో తెలియదని చెప్పారు. ‘అంకుల్ మీతో వస్తాం. అన్నం పెడతారా’ అని కోరడంతో ఆయన వారిని ఒంగోలు బొమ్మరిల్లులో చేర్పించారు.

Similar News

News October 1, 2025

ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టుల ఖాళీలపై కసరత్తు

image

ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలను డీఈవో కిరణ్ కుమార్ సేకరిస్తున్నారు. DSC-2025లో నూతనంగా పోస్టులు సాధించిన అభ్యర్థులకు ఈనెల 3 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. చివరి రోజు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అసలు టీచర్స్ లేకుండా సర్దుబాటుపై నడుస్తున్న పాఠశాలలకు తొలి ప్రాధాన్యత ఇచ్చేలా, నిష్పత్తి ఆధారంగా ఖాళీలు భర్తీ చేయనున్నారు.

News October 1, 2025

ప్రకాశం ఎస్పీని కలిసిన వైసీపీ నేతలు

image

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైసీపీ మార్కాపురం ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు తదితర నేతలు కలిశారు. శాంతి భద్రతలపై ఆయనతో మాట్లాడారు.

News October 1, 2025

ప్రకాశం: వేలిముద్రకు చిక్కిన 12 కేసుల నిందితుడు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి 4494 మంది అనుమానిత వ్యక్తుల బయోమెట్రిక్‌ను తనిఖీ చేసినట్లు SP కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకై బయోమెట్రిక్ విధానం ద్వారా వ్యక్తుల నేర చరిత్రను పోలీసులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. గతనెలకు సంబంధించి 15 మంది ముద్దాయిలను గుర్తించగా, అందులో ఒకరిపై 12 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.