News March 20, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్పై మంత్రి కొండా సమీక్ష

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డీపీఆర్లో భాగంగా ఎస్టీపీల ఏర్పాటుకు తక్షణమే స్థలం కేటాయించాలని మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో జిల్లా అధికారులు, కార్పొరేషన్ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు. నగర ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సహకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి జూన్ మాసంలోనే రూ.4,500 కోట్లు మంజూరు చేశారన్నారు.
Similar News
News September 14, 2025
విజయవాడలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

విజయవాడ నగర వ్యాప్తంగా, రూరల్ ప్రాంతాల్లో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ.190గా ఉంది. స్కిన్ లెస్ కేజీ రూ. 250, స్కిన్ కేజీ రూ.250 విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే కేజీకి 10 రూపాయలు ఎక్కువగా ఉంది. మటన్ కేజీ రూ. 980గా ఉంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 14, 2025
అనకాపల్లి: ఢిల్లీ సదస్సుకు కొత్తూరు సర్పంచ్

నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 15 న జరిగే సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు సర్పంచ్ ఎస్ లక్ష్మీప్రసన్నకు ఆహ్వానం అందింది. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 75 మంది సర్పంచులను సదస్సులకు ఆహ్వానించగా ఏపీ నుంచి ఆరుగురు ఉన్నారు. వారిలో కొత్తూరు సర్పంచ్ ఒకరు కావడం విశేషం. ఈ మేరకు ఆమె ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
News September 14, 2025
HYD: నేడు గాంధీ మెడికల్ కాలేజీ వ్యవస్థాపక దినోత్సవం

సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాల నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గాంధీ కళాశాల ప్రాంగణంలోని అలుమ్ని భవనంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డా.జీఆర్ లింగమూర్తి, వెంకటరత్నంలు తెలిపారు. కాగా.. గాంధీ మెడికల్ కళాశాల దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్పత్రిగా నిలిచింది.