News October 16, 2025

అందరి సహకారంతో స్నాతకోత్సవం విజయవంతం: పీయూ వీసీ

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన స్నాతకోత్సవం కనుల పండువగా జరిగిందని వైస్ ఛాన్స్‌లర్ (వీసీ) అన్నారు. గవర్నర్ పర్యటనను దగ్గర ఉండి పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసిన జిల్లా ఎస్పీ డి. జానకి, నెల ముందు నుంచి స్నాతకోత్సవ ఏర్పాట్లపై కృషి చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు వీసీ కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొ.రమేశ్ బాబు, కంట్రోలర్ డా.ప్రవీణ ఉన్నారు.

Similar News

News October 17, 2025

విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

image

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

News October 17, 2025

అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు

image

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్‌ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.

News October 17, 2025

విజయవాడ: విద్యార్థి మృతిపై అనుమానాలు

image

సింగ్ నగర్‌లో 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. బాత్‌రూమ్‌లో 2 అడుగుల ఎత్తులో ఉన్న హ్యాంగర్‌కు ఉరి వేసుకున్నట్లు కనిపించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా యశ్వంత్ పేరెంట్స్ విడిపోయారు. తల్లికి క్యాన్సర్‌ కావడంతో యశ్వంత్ స్కూల్‌కు సరిగా వెళ్లడం లేదు. చెల్లి దివ్యాంగురాలు. ఈ పరిణామాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.