News April 14, 2025

అందువలనే భారీ ప్రాణ నష్టం: ఐజీ

image

మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో పాటు బాణసంచా తయారు చేసే షెడ్లు పక్కపక్కనే ఉండడం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ ఐజీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. సోమవారం కైలాసపట్నంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఉమ్మడి విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తయారీ కేంద్రాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News April 16, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రీజనల్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో తమకు నెల గడువు కావాలని యాజమాన్యం కోరింది. అలాగే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను అంగీకరించిన కమిషనర్ యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించింది. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనే తదితర డిమాండ్లతో కార్మికులు సమ్మె చేయాలని భావించిన విషయం తెలిసిందే.

News April 16, 2025

పాలమూరు జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔ఆర్థిక శాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్యభూమిక:PU ప్రిన్సిపల్✔రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ✔ఉమ్మడి జిల్లాల్లో భారీ వాన✔పోలేపల్లికి పోటెత్తిన భక్తులు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ✔మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.

News April 16, 2025

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు

image

ఉప్పల్ పీహెచ్సీలో టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 750 టీబీ రోగులకు 1,500 పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ, టిబి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చని అధికారులు తెలిపారు.

error: Content is protected !!