News January 8, 2026
అందోల్: ఆరోగ్యశ్రీ ఉద్యోగి సూసైడ్

అందోల్ మండలం సంగుపేట గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో కమ్మరి రవీందర్(39) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రవీందర్ 12 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రవీందర్ మరణంతో భార్య, కుమారుడు అనాథలయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
నెల్లూరు: రంజాన్.. 31 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.!

31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం రావడం విశేషం. నేటి(బుధవారం) రాత్రి చంద్ర దర్శనంతో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నెల ప్రారంభమవుతుంది. గురువారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు తమ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. ఈ నెలలో సేవలు, దానధర్మాలు చేస్తే పుణ్యకార్యంగా భావిస్తారు. మార్చి 19 లేదా 20 తేదిలలో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఆరోజు ఈద్ ఉల్ ఫితర్ను చేసుకోనున్నారు.
News February 18, 2026
పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన్ను పికప్ చేసుకునేందుకు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తుండగా కాన్వాయ్లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో చివరి వాహనం దెబ్బతింది. ప్రమాద సమయంలో కాన్వాయ్లో పవన్ లేకపోవడం, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
News February 18, 2026
బ్యాటరీ రెంటల్ కార్లు.. ఏంటీ విధానం?

ఈ విధానంలో కస్టమర్ కేవలం కారే కొనుగోలు చేస్తాడు. బ్యాటరీ కాదు. బ్యాటరీని షోరూమ్ రెంట్కి ఇస్తుంది. నెలకు మినిమం అమౌంట్ డిపాజిట్ చేసుకుంటుంది. ఆపై ఎన్ని కి.మీ ఎక్కువ తిరిగితే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంది. కారు కొనుగోలు సమయంలో కస్టమర్పై అధిక భారం పడొద్దనే కంపెనీలు బ్యాటరీ రెంటల్ విధానాన్ని తీసుకొచ్చాయి. మార్కెట్లో ఇప్పటికే MG విండ్సర్ ఇలాగే రన్ అవుతుండగా తాజాగా మారుతీ <<19171974>>ఈ-విటారా<<>> వచ్చింది.


